ETV Bharat / state

Double Bedroom Houses Distribution in Hyderabad : డబుల్ సంబురం.. నేడే రెండో విడత 2BHK ఇండ్ల పంపిణీ

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 7:03 AM IST

Double Bedroom Houses Second Phase Distribution
2BHK Second Phase Distribution Today

Double Bedroom Houses Distribution in Hyderabad Today: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపంపిణీ కొనసాగుతోంది. తొలివిడతలో 11వేల700 ఇళ్లు పంపిణీచేయగా.. నేడు రెండోవిడతలో 13వేల 300 గృహలను లబ్దిదారులకు సర్కారు అందించనుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో.. 2వేల 100 మంది లబ్దిదారులకు మంత్రి కేటీఆర్ అందించనుండగా.. మిగిలిన 8 చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు.

Double Bedroom Houses Distribution in Hyderabad డబుల్ సంబురం.. నేడే రెండో విడత 2BHK ఇండ్ల పంపిణీ

Double Bedroom Houses Distribution in Hyderabad Today : రెండో విడతలో ఎంపికైన లబ్దిదారులకు ఇవాళ డబుల్ బెడ్​రూం ఇండ్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్​ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు.

2BHK Second Phase Distribution Today : అందులో భాగంగా మొదటి విడతలో ఎన్ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్​లైన్ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేశారు. రెండో విడతలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక కోసం.. ఈ నెల 15 వ తేదీన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్​లైన్ డ్రా నిర్వహించి 13,300 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు.

డ్రా లో ఎంపికైన లబ్దిదారులకు ఇవాళ 9 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్​లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ (Minister KTR)2100 మంది లబ్దిదారులకు మధ్యాహ్నం 12 గంటలకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్​సాన్​పల్లిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 700 మంది లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను ఇవ్వనున్నారు.

2BHK Distribution in Hyderabad : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అట్టిగూడలో భూగర్బ గనులశాఖ మంత్రి మహేందర్ రెడ్డి 432 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తట్టి అన్నారంలో హోంమంత్రి మహమూద్ అలీ 1268 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ లోని తిమ్మాయిగూడ లో 600 ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొననున్నారు.

పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు-2 లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు(Harish Rao) 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను అందించనున్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్​నగర్-3లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి 1200 మంది లబ్దిదారులకు ఇండ్లను అందిస్తారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 1000 మంది లబ్దిదారులకు ఇండ్లను అందిస్తారు.

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ 1100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. మొత్తం గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్ల పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విడతల వారీగా మిగతా దశల్లో రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.

Telangana Double Bedroom Application Status Check Online : ఆన్​లైన్​లో 'డబుల్ బెడ్ రూం' అప్లికేషన్ స్టేటస్.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

Double Bedroom Houses Distribution in Hyderabad : జాతరగా ఇళ్ల పంపిణీ.. కల నెరవేరిన వేళ లబ్ధిదారుల ఆనందం 'డబుల్'

Double Bedroom Housing Community at Kollur : కొల్లూర్​లో ఆసియాలోనే అతిపెద్ద 2BHK ప్రాజెక్టు.. రేపే ప్రారంభోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.