ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... 10 మందికి గాయాలు

author img

By

Published : Feb 16, 2020, 11:40 AM IST

Deadly road accident on National Highway at medchal district
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

మేడ్చల్ జిల్లా డబీర్​పూర ప్రధాన రహదారిపై ఇండియన్ అయిల్​ పెట్రోల్ పంపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ నుంచి నగరానికి వస్తున్న ఫిగో కారును, నిజామాబాద్ వైపు వెళ్తున్న జైలో కారు డివైడర్​ను దాటి అటు వైపు వస్తున్న కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడు హైదరాబాద్ అంబర్​పేటకు చెందిన సామల కార్తీకేయగా గుర్తించారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి : తెలంగాణలో 91,295 ఎకరాల అడవి దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.