ETV Bharat / state

హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు: సీసీఎంబీ

author img

By

Published : Mar 4, 2021, 4:24 PM IST

Updated : Mar 4, 2021, 9:30 PM IST

హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు: సీసీఎంబీ
హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు: సీసీఎంబీ

16:21 March 04

హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు: సీసీఎంబీ

హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు: సీసీఎంబీ

హైదరాబాద్ నగరంలోని సుమారు 54శాతం మందిలో కరోనా వైరస్​కి సంబంధించిన యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ, ఎన్​ఐఎన్ సంస్థలు ప్రకటించాయి. నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి సీసీఎంబీ, ఎన్​ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థ సంయుక్తంగా సీరో సర్వేని నిర్వహించాయి. ఈ మేరకు సీసీఎంబీ ఐ హబ్​లో నిర్వహించిన కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా, ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. నగరంలోని మొత్తం 30 వార్డుల్లో 9వేల మంది నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించిన సీసీఎంబీ ఈ మేరకు నిర్ధారించింది. ఒక్కో వార్డులో సుమారు 300 మంది నుంచి రక్త నమూనాలను సేకరించిన ఎన్​ఐఎన్ ఆ శాంపిళ్లను సీసీఎంబీ సహాకారంతో విశ్లేషించింది. ఈ సర్వేలో 10ఏళ్లు మొదలుకొని 90ఏళ్ల వారు భాగస్వాములు అయ్యారు.

   జనవరి మొదటి వారం నుంచి రెండు దఫాలుగా చేసిన సర్వేలో ఎన్​ఐఎన్​కి సంబంధించిన 75మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఈ సర్వే ప్రకారం యాంటీబాడీలు ఉన్న వారిలో సుమారు 75శాతం మందికి తమకు కరోనా వచ్చిన విషయం కూడా తెలియకపోవటం గమనార్హం. గతంలో ఒకసారి నగరంలో ఇలాంటి సర్వే చేసిన ఎన్​ఐఎన్ గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్న విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో స్త్రీలలో 56శాతం, పురుషుల్లో 53, వృద్ధుల్లో కేవలం 49శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు గుర్తించారు. ఇక ఈ సర్వే ప్రకారం ఇప్పటికే సుమారు 54శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందగా... ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్​తో త్వరలో హార్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన గవర్నర్‌ తమిళిసై

Last Updated :Mar 4, 2021, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.