ETV Bharat / state

'కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి'

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 1:41 PM IST

Updated : Dec 29, 2023, 3:02 PM IST

Congress Ministers Medigadda Barrage Visit : కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, పొన్నం, పొంగులేటిలతో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. వీరంతా కుంగిన బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు.

Ministers visit Medigadda Barrage
Ministers visit Medigadda Barrage

Congress Ministers Medigadda Barrage Visit : మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ మంత్రుల బృందం సందర్శఇంచింది. కుంగిన పిల్లర్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ప్రారంభం నుంచి కాంగ్రెస్‌ ఒకే విధానంతోనే ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి

గతంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రూ.38,000ల కోట్లతో, 16.40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80,000ల కోట్లతో, 18 లక్షల ఎకరాలకు నీటిని ఇచ్చేందుకు నిర్ణయించిందని వివరించారు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మేడిగడ్డ కుంగడం బాధాకరమైన విషయమని వాపోయారు. కానీ దీనిపై ఇప్పటివరకు కేసీఆర్‌ స్పందించలేదని విమర్శించారు.

"కాళేశ్వరం కంటే ప్రాణహిత ప్రాజెక్టు ఉత్తమమైనది. మహారాష్ట్ర కొంత ముంపుతో ప్రాణహిత పూర్తి అయ్యేది. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80,000ల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచారు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టకు రూ.90,000ల కో‌ట్లు ఖర్చు చేశారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయింది. ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉంది." - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి

Medigadda Barrage Damage Issue : సాంకేతిక పరంగా జరిగిన తప్పులను, ప్రజలకు తెలిపే విధంగా అధికారులు పనులు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నీరు నిల్వ ఉన్నప్పుడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ముంపు గ్రామాల్లో నష్టపోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. మంత్రులతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ మేడిగడ్డను పరిశీలించారు. అనంతరం కాళేశ్వరంపై మంత్రులకు, ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

"కాళేశ్వరం కట్టాక ఇచ్చింది స్థిరీకరణ మాత్రమే. భూ సేకరణ సమస్యలతో కొత్త ఆయకట్టు కష్టమే. ఇప్పటివరకు 98వేల ఎకరాలు మాత్రమే సాగు జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసింది రూ.93 వేల కోట్లు. పాలమూరుకు కాళేశ్వరం కిందనే అప్పులు తీసుకున్నాం. ఐదేళ్లలో 173 టీఎంసీలు మాత్రమే లిఫ్టు్‌ చేశారు. 2 టీఎంసీల లిఫ్టుకు 5 వేల మెగావాట్ల కరెంట్‌ అవసరం. 2 టీఎంసీల సామర్థ్యానికి రూ.94 వేల కోట్లతో ప్రతిపాదన చేశాం. మూడో టీఎంసీ లిఫ్టు్‌కు రూ.33,400 కోట్లు ప్రతిపాదన చేశాం." అని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు.

కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

Last Updated : Dec 29, 2023, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.