ETV Bharat / state

ఎర్రకోటపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం - మోదీ మెడిసిన్​​కు కాలం చెల్లించింది : సీఎం రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 10:37 PM IST

CM Revanth Reddy
CM Revanth Reddy Speech at Nagpur Sabha

CM Revanth Reddy Speech at Nagpur Sabha : దిల్లీలోని ఎర్రకోటపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం, మోదీ మెడిసిన్​కు కాలం చెల్లిందని సీఎం రేవంత్​ రెడ్డి ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్​లో జరిగిన కాంగ్రెస్​ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

CM Revanth Reddy Speech at Nagpur Sabha : దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్​ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. మోదీ మెడిసిన్​కు కాలం చెల్లిందని ఆరోపించారు. డబుల్​ ఇంజిన్​ సర్కారు​ అంటూ బీజేపీ పదే పదే చెబుతోందని ఎద్దేవా చేశారు. డబుల్​ ఇంజిన్​ సర్కారు అంటే అదానీ, మోదీ అంటూ విమర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్​లో జరిగిన కాంగ్రెస్​ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ(Congress Foundation Day) కార్యక్రమంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్​ వరకు రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర చేశారని 150 రోజులు 4000లకు పైగా కిలోమీటర్లు చేశారని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు. ఈ భారత్​ జోడో యాత్ర(Bharat Jodo Yatra) వల్ల అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు వివరించారు. మహారాష్ట్రలో కూడా జరగబోవు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్​ గాంధీ భారత్​ న్యాయ్​ యాత్ర(Bharat Nyay Yatra)ను మణిపుర్​ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నట్లు రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర ముగింపుతో నయా జోష్.. మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు

"దేశంలో ఎర్రకోటపై మూడు రంగుల కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం. మోదీ మెడిసిన్​కు కాలం చెల్లింది. డబుల్​ ఇంజిన్​ సర్కార్​ అంటూ బీజేపీ పదేపదే చెబుతోంది. డబుల్​ ఇంజిన్​ సర్కారు అంటే అదానీ, మోదీ అని అర్థం. రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రతో కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఆ యాత్రతోనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం సాధించాం. ఈసారి మహారాష్ట్రలో కూడా అధికారాన్ని దక్కించుకోనున్నాము." - రేవంత్​ రెడ్డి, సీఎం

Congress Foundation Day Celebrations 2023 : ఈసారి ఎర్రకోట(Red Fort)పై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని సీఎం రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మెడిసిన్​కు ఒక ఎక్స్​ఫైరీ తేదీ ఉంటుందని అలాగే నరేంద్రమోదీ అనే మెడిసిన్​కు కూడా ఎక్స్​ఫైరీ తేదీ అయింపోయిందన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్​ దేశంలో పనిచేయదని చెప్పారు.

CM Revanth Reddy Fires PM Modi : లోక్​సభలో రాహుల్​ గొంతు విప్పడంతో అదానీ ఇంజిన్​ ఆగిపోయి షెడ్​కు పోయిందని ఆరోపించారు. ఇప్పుడు భారత్​ న్యాయ్​ యాత్రతో ప్రధాని ఇంజిన్​ ఆగిపోయి, షెడ్డుకు పంపడం ఖాయమని విమర్శించారు. కాంగ్రెస్​ శ్రేణులంతా వందరోజులు పాటు దేశం కోసం, కాంగ్రెస్​ గెలుపు కోసం పనిచేయాలని సీఎం రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు.

ఎర్రకోటపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం - మోదీ మెడిసిన్​​కు కాలం చెల్లించింది సీఎం రేవంత్ రెడ్డి

'అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన'- ''ఇండియా' ఐక్యతతో బీజేపీ కనుమరుగు'

'అప్పటిలోగా నేమ్​ప్లేట్​లు మార్చుకోండి'- కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు- ఆస్తుల ధ్వంసంపై డీకే ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.