ETV Bharat / state

గడ్డపోతారం మైలాన్​ పరిశ్రమలో పేలుడు.. ఐదుగురికి గాయాలు

author img

By

Published : Dec 21, 2019, 10:54 AM IST

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో అర్ధరాత్రి పేలుడు జరిగింది. ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

blast in industrial area in Hyderabad
గడ్డపోతారం మైలాన్​ పరిశ్రమలో పేలుడు.. ఐగురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. మైలాన్ పరిశ్రమ యూనిట్​లో అర్ధరాత్రి డ్రైయర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తొలుత సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి... ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

గడ్డపోతారం మైలాన్​ పరిశ్రమలో పేలుడు.. ఐదుగురికి గాయాలు

ఇదీ చూడండి : 'వాడివేడిగా ఐటీడీఏ సమావేశం... సమస్యలు మేం పరిష్కరిస్తాం'

Intro:hyd_tg_14_21_mylan_incident_av_ts10056
Lsnraju:9394450162
యాంకర్:Body:సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో మైలాన్ పరిశ్రమలో డ్రైయర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది
జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమ యూనిటీ వ లో అర్ధరాత్రి డ్రైయర్ పేలింది. అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికుల ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన క్షతగాత్రులను తొలుత సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కి అనంతరం యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో బ్రహ్మయ్య నాగేశ్వరరావు శ్రీనివాస్ అనే కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోందిConclusion:పోలీసులకు ఉదయం సమాచారం అందడంతో పరిశ్రమ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.