ETV Bharat / state

మహాత్మ జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి : శ్రీనివాస్ గౌడ్​

author img

By

Published : Nov 28, 2020, 4:11 PM IST

Updated : Nov 29, 2020, 1:52 PM IST

Bharat Ratna should be given to Mahatma Jyotirao Poole says minister srinivas goud
మహాత్మ జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి : శ్రీనివాస్ గౌడ్​

వెనుకబడిన వర్గాల కోసం పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 130వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.

కేంద్రప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం పార్లమెంట్​లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నివాళులు అర్పించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేసిన ఆ మహానీయుడికి భారత రత్న ప్రకటించాలని ఆయన కోరారు.

చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు వినియోగించుకుంటున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా బీసీల సంక్షేమంపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ మనిమంజరి సాగర్​, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఇతర కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

ఇదీ చూడండ:తెరాస బహిరంగ సభకు సర్వం సిద్ధం

Last Updated :Nov 29, 2020, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.