ETV Bharat / state

బాలాపూర్​ గణనాథునికి ప్రత్యేక పూజలు.. కాసేపట్లో నిమజ్జనం

author img

By

Published : Sep 1, 2020, 8:20 AM IST

Updated : Sep 1, 2020, 8:52 AM IST

హైదరాబాద్‌ బాలాపూర్​ గణేష్ శోభయాత్ర మొదలైంది. గతంలోలా సందడి లేకపోయినా.. గణపతికి ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర ప్రారంభించారు.

ganesh immersion 2020
ganesh immersion 2020

భక్తుల చేత పూజలందుకున్న బాలాపూర్​ గణపయ్య మరి కాసేపట్లో గంగమ్మ చెంతకు చేరనున్నాడు. ఉదయాన్నే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సాగే ​ బాలాపూర్​ గణేశ్​ లడ్డు వేలం.. ఈసారి కరోనాతో బోసిపోయింది. లడ్డు వేలాన్ని రద్దుచేశారు. ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనల కారణంగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నిమజ్జనం జరుగుతోంది. ప్రతిఏటా లాగా ట్యాంక్​ బండ్​లో కాకుండా ఈసారి స్థానికంగా నిమజ్జనం చేయనున్నారు.

ఇదీ చూడండి: 'ఆయన అలంకరించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు'

Last Updated :Sep 1, 2020, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.