ETV Bharat / state

JAGAN BAIL: జగన్​ బెయిల్​ రద్దు పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా

author img

By

Published : Jul 14, 2021, 1:53 PM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. అందుకోసం 10 రోజులు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరింది.

JAGAN BAIL: జగన్​ బెయిల్​ రద్దు పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా
JAGAN BAIL: జగన్​ బెయిల్​ రద్దు పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా

జగన్‌ బెయిల్‌ రద్దు (Jagan's bail revocation) కోరుతూ ఏపీ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టు (CBI COURT)లో మరోసారి విచారణ చేసింది. ఈనెల 8న జగన్, రఘురామకృష్ణరాజు తమ వాదనలను లిఖిత పూర్వకంగా న్యాయస్థానానికి సమర్పించారు. ఈ విషయమై మరోసారి వాదనలు కొనసాగాయి.

వైఖరి మార్చుకున్న సీబీఐ... లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని.. అందుకోసం 10 రోజులు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరింది. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని.. ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ నెల 26కు విచారణను వాయిదా వేసింది.

ఈనెల 8న విచారణలో అంశాలు..

ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని.. పిటిషన్​లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. జగన్ వాదనలపై సమాధానాలు ఇచ్చేందుకు రఘురామ కృష్ణ రాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో నేటికి వాయిదా పడింది.

ఇదీ చదవండి: AP CM: 'జగన్‌ బెయిల్‌ రద్దు' అంటూ.. సామాజిక మాధ్యమాల్లో కల్పిత కథనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.