ETV Bharat / state

గన్​పార్క్​ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా... అరెస్ట్​

author img

By

Published : Jul 13, 2020, 12:25 PM IST

Updated : Jul 13, 2020, 1:57 PM IST

all party leaders protest at gun park
గన్​పార్క్​ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా... అరెస్ట్​

సచివాలయం కూల్చివేతపై అఖిలపక్ష సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ గన్​పార్క్ వద్ద తెదేపా, సీపీఐ, తెజస, కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

సచివాలయం కూల్చివేతను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గన్​పార్క్​ వద్ద తెదేపా, సీపీఐ, తెజస నాయకులు ఆందోళనలు చేపట్టారు. నిరసనకు అనుమతి లేదని తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్​ను పోలీసులు అరెస్ట్ చేసి..స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలు చెప్పిన మాటలను సర్కార్ పరిగణలోకి తీసుకోవడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పాలసీలు సరిగ్గా లేకుంటే ప్రతిపక్షాలుగా నిలదీస్తామన్నారు.

గన్​పార్క్​ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా... అరెస్ట్​

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

Last Updated :Jul 13, 2020, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.