ETV Bharat / state

నిమజ్జనంలో అపశ్రుతి.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

author img

By

Published : Sep 12, 2019, 1:28 PM IST

Updated : Sep 12, 2019, 2:53 PM IST

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్‌పురాలో ఓ కానిస్టేబుల్ క్రేన్‌ నుంచి జారిపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది.

canistable

హైదరాబాద్​లో గణేశ్ నిమజ్జనోత్సంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్‌పురాలో గణేశ్‌ విగ్రహాన్ని క్రేన్‌తో లారీలో పెడుతుండగా కానిస్టేబుల్ రవీందర్​ జారిపడ్డాడు. కేర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఆయన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. గణేశ్​ నిమజ్జనంలో భాగంగా కిషన్​బాగ్​లోని గణేశ్ మండపం వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. బాధితుడు గత కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కిడ్నిలో రాళ్లు ఉండడంతో చికిత్సకు సెలవుల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ అధికారులు మంజూరు చేయలేదని... పని ఒత్తిడి కారణంగానే రవీందర్ అనారోగ్యానికి గురయ్యాడని ఆరోపించారు.

నిమజ్జనంలో అపశ్రుతి.. కానిస్టేబుల్ పరిస్థితి విషమం

ఇదీ చూడండి: భాగ్యనగరంలో వైభవంగా గణేశుని శోభాయాత్ర

Last Updated :Sep 12, 2019, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.