ETV Bharat / state

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 869 కరోనా కేసులు, 8 మరణాలు

author img

By

Published : Jul 1, 2021, 6:44 PM IST

covid cases
covid cases

రాష్ట్రంలో కొత్తగా 869 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతిచెందారు. ప్రస్తుతం 13,052 యాక్టివ్​ కేసులున్నాయి.

రాష్ట్రంలో మరో 869 మంది కరోనా బారిన పడినట్లు వైద్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది. 24 గంటల్లో 1,05,123మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 869 మందికి వైరస్‌ నిర్ధరణ అయింది. మరో 1178 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు స్పష్టం చేసింది. తాజా కేసులతో ఇప్పటి వరకు కొవిడ్​ సోకిన వారి సంఖ్య 6,24,379కి చేరింది.

మహమ్మారి కోరల్లో చిక్కి మరో 8 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,669కి చేరింది. మరో 1,197 మంది కోలుకున్నారు. మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,07,658కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 13,052 యాక్టివ్​ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.32 శాతానికి పెరిగింది.

తాజాగా వచ్చిన కేసుల్లో జీహెచ్ఎంసీ 101, ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 38, జగిత్యాల 19, జయశంకర్ భూపాలపల్లి 19, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ 51, ఖమ్మం 52, కొమరంభీం ఆసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 17, మహబూబాబాద్ 35, మంచిర్యాల 42, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్ గిరి 41, ములుగు 20, నాగర్ కర్నూల్ 6, నల్గొండ 72, నారాయణ్ పేట 5, నిర్మల్ 8, నిజామాబాద్ 8, పెద్దపల్లి 45, రాజన్న సిరిసిల్ల 22, రంగారెడ్డి 65, సంగారెడ్డి 10, సూర్యాపేట 54, వికారాబాద్ 8, వనపర్తి 9, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ 33, యాదాద్రి భువనగిరి జిల్లాలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: 'సెప్టెంబర్​ నుంచి బూస్టర్​ డోసు పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.