ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 6,876 కరోనా కేసులు, 59 మరణాలు

author img

By

Published : May 4, 2021, 8:57 AM IST

Updated : May 4, 2021, 9:26 AM IST

new corona cases
new corona cases

08:54 May 04

రాష్ట్రంలో కొత్తగా 6,876 కరోనా కేసులు, 59 మరణాలు

కొవిత్​తో కొత్తగా 59 మరణాలు
కొవిత్​తో కొత్తగా 59 మరణాలు

  తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,876 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 59 మంది మరణించారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 70,961 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

  కొవిడ్​తో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,476కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1029 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో 502, రంగారెడ్డి జిల్లాలో 387 మందికి పాజిటివ్​ వచ్చింది.  

ఇదీ చూడండి: రాష్ట్రానికి చేరిన 4 లక్షల డోసులు.. నేటి నుంచి యథావిధిగా పంపిణీ

Last Updated : May 4, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.