ETV Bharat / state

'బ్యాంకుల ప్రైవేటీకరణ కేంద్రం వెనక్కి తీసుకోవాలి'

author img

By

Published : Mar 15, 2021, 4:42 PM IST

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సమ్మె
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సమ్మె

బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ భద్రాచలంలో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. మూతపడ్డ బ్యాంకుల ముందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సమ్మె బాట పట్టారు.

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా.. మూతపడ్డ ప్రభుత్వ బ్యాంకుల ముందు నిరసన తెలిపారు. భద్రాచలంలోని బ్యాంకు రోడ్డులోని ఎస్బీఐ వద్ద ధర్నా చేపట్టారు.

ఇదీ చూడండి: మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి కొవిడ్ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.