గత నెల 24న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దళిత మహిళ టేకు లక్ష్మిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని ఆదిలాబాద్లోని కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దుండగులను వెంటనే శిక్షించి... బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్ర కులానికి, దళిత కులానికి సమన్యాయం పాటించేలా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చూడండి : 'పోలీసులు ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం'