ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ సందర్శించారు. వారికి మెశ్రం వంశస్థులు ఘనంగా స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా సన్మానించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో నాగోబా ఆలయం విశేషంగా అభివృద్ధి చెందిందని వారు అన్నారు. రానున్న రోజుల్లో నాగోబా విశిష్టత జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు.. తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.