ETV Bharat / sports

ఘోర రోడ్డు ప్రమాదం.. యువ టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ మృతి

author img

By

Published : Apr 18, 2022, 7:31 AM IST

Updated : Apr 18, 2022, 11:51 AM IST

18years table tennis player died in road accident
18ఏళ్ల టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ మృతి

18 years tennis player died: రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ విశ్వ దీనదయాలన్​ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

18 years tennis player died: ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో పాల్గొని విజేతగా తిరిగి రావాలని వెళ్లిన 18 ఏళ్ల టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్ విశ్వ దీనదయాలన్(తమిళనాడు) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని టెబుల్ టెన్నిస్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా తెలిపింది.

నేడు(సోమవారం) 83వ సీనియర్​ నేషనల్​ అండ్​ ఇంటర్​ స్టేట్​ టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏప్రిల్​ 17న విశ్వ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు ట్యాక్సీలో గువాహటి నుంచి షిల్లాంగ్​కు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎన్​హెచ్​ 6పై ప్రయాణిస్తుండగా షాంగ్​బంగ్లా వద్ద ఎదురుగా వచ్చిన ఓ ట్రక్​ అదుపుతప్పి.. ఈ ప్లేయర్స్​ ప్రయాణిస్తున్న ట్యాక్సీపైకి దూసుకొచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్యాక్సీ డ్రైవర్​, విశ్వ అక్కడికక్కడే కన్నుమూయగా.. రమేశ్ సంతోశ్​ కుమార్​, అభినాష్​ ప్రసన్నాజీ, కిషోర్​ కుమార్​కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై పలువురు క్రీడా ప్రముఖులు సహా మేఘాలయ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విశ్వ మరణం తనను తీవ్ర బాధకు గురి చేసిందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్​రాడ్​ సంగ్మ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: Cheteshwar Pujara: కౌంటీల్లో పుజారా డబుల్‌ సెంచరీ

Last Updated :Apr 18, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.