ETV Bharat / sports

PCB New Chairman : పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​గా జకా అష్రాఫ్​.. నాలుగు నెలలే..

author img

By

Published : Jul 6, 2023, 6:03 PM IST

Updated : Jul 6, 2023, 7:22 PM IST

PCB New Chairman Zaka Ashraf
పాక్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​గా జకా అష్రాఫ్

PCB New Chairman : పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ఏర్పాటు చేసిన మేనేజ్​మెంట్​ కమిటీకి నూతన ఛైర్మన్​గా జకా అష్రాఫ్​ నియమితులయ్యారు. ఈయన మొత్తం నాలుగు నెలలపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

PCB New Chairman : పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) మేనేజ్​మెంట్​ కమిటీ కొత్త ఛైర్మన్​గా జకా అష్రాఫ్​ నియమితులయ్యారు. మొత్తం నాలుగు నెలలపాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు. పది మంది సభ్యులతో కూడిన బోర్డు మేనేజ్​మెంట్​ కమిటీకి ఆయన సారథ్యం వహించనున్నారని ప్రముఖ క్రిక్​ ఇన్​ఫో వెబ్​సైట్​ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో అష్రాఫ్​తో పాటు కలీమ్ ఉల్లా ఖాన్, అషాఫక్ అక్తర్, ముస్సాదిక్ ఇస్లాం, అజ్మత్ పర్వేజ్, జహీర్ అబ్బాస్, ఖుర్రం సూమ్రో, ఖవాజా నదీమ్, ముస్తఫా రామ్‌డే జుల్ఫికర్ మాలిక్ ఉన్నారు. అయితే జకా అష్రాఫ్​కు సంబంధించి అధ్యక్ష ఎన్నికను నిలిపేయాలని ఇటీవలే బలూచిస్తాన్ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ 10 రోజులకే అష్రాఫ్​​ను తాత్కాలికంగా మేనేజ్​మెంట్​ కమిటీ ఛైర్మన్​గా నియమిస్తూ ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​కు సంబంధించి వివిధ న్యాయపరమైన అంశాలు ఉండటం వల్ల గత కొంత కాలంగా కోర్టుల్లో ఈ అంశంపై పలు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దీని వల్ల ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. అందుకే నాలుగు నెలల పాటు అష్రాఫ్​ను పీసీబీ మేనేజ్​మెంట్​ కమిటీ కొత్త ఛైర్మన్​గా నియమిస్తూ పాక్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కమిటీలో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ జహీర్ అబ్బాస్ కూడా ఉన్నారు. మరోవైపు పీసీబీ చీఫ్‌ మారడం ఆరు నెలల కాలంలో ఇది మూడవసారి. ఈ ఏడాది ఆరంభంలో రమీజ్‌ రజాను తప్పించి సేథీకి బాధ్యతలు అప్పగించగా.. ఇప్పుడు సేథీ స్థానంలో అష్రాఫ్‌ వచ్చాడు. ఈయన 2011 నుంచి 2014 వరకు పీసీబీ అధ్యక్షునిగా పని చేశాడు.

ఇటీవలే ఆసియా కప్-2023​ నిర్వహణకు సంబంధించి పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు మాజీ చీఫ్​ నజామ్​ సేథీ ప్రతిపాదించిన 'హైబ్రిడ్​ మోడల్​' తనకు నచ్చలేదంటూ పీసీబీ కొత్త చైర్మన్​ జకా ఆష్రాఫ్​ చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏసీసీ ఆమోదం తెలిపిన హైబ్రిడ్ మోడల్ వల్ల పాకిస్థాన్‌కు నష్టం జరుగుతుందని.. తనకీ విధానం ఏమాత్రం నచ్చలేదని ఆష్రాఫ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధత మళ్లీ నెలకొన్న నేపథ్యంలో ఈ మోడల్ తిరస్కరణపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను వేరే దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణను ఇచ్చుకున్నారు.

  • It’s an Honour for me to take Charge as a Chairman. I want to Thank @AAliZardari Saab for trusting my Capabilities. I promise I will keep a positive environment with players and management staff. I will also provide full support to our Captain. Pakistan Zindabad🇵🇰🙌. https://t.co/b4G6JxhYMw

    — Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Jul 6, 2023, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.