ETV Bharat / sports

'భారత్​ను వారి గడ్డపైనే ఓడించాలి.. అదే నా కోరిక'

author img

By

Published : Dec 29, 2021, 12:36 PM IST

Warner team india test series, warner ashes 2023, వార్నర్ టీమ్ఇండియా, వార్నర్ యాషెస్ 2023
Warner

Warner India Test Series: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన టెస్టు రిటైర్మెంట్​పై స్పందించాడు. తాను వీడ్కోలు పలకడానికి ముందు రెండు జట్లపై టెస్టు సిరీస్ గెలవాలని ఉందని తెలిపాడు. అది ఎవరిపై అంటే?

Warner India Test Series: ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్​లో సత్తాచాటుతున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తాజాగా తన టెస్టు రిటైర్మెంట్​పై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ కంటే ముందు 2023లో ఇంగ్లాండ్​లో జరగబోయే యాషెస్​తో పాటు భారత గడ్డపై టెస్టు సిరీస్​ గెలవాలని కోరికగా ఉందన్నాడు.

"భారత్ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవలేకపోయాం. ఈసారి గెలవడానికి ప్రయత్నిస్తాం. ఇంగ్లాండ్​తో 2019లో జరిగిన యాషెస్ సిరీస్​ను డ్రా చేసుకున్నాం. 2023లో వారి గడ్డపై వారిని ఓడిస్తామని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను మంచి ఫామ్​లో ఉన్నా. భవిష్యత్​లో ఇదే ఫామ్​ను కొనసాగిస్తానని అనుకుంటున్నా."

-వార్నర్, ఆస్ట్రేలియా బ్యాటర్

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్​ వార్నర్​కు కలిసి రాలేదు. బ్యాటర్​, కెప్టెన్​గా విఫలమవడం వల్ల అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్. రెండో అంచెలో అతడికి తుది జట్టులో అవకాశాలు లభించలేదు. దీంతో జట్టును వీడుతున్నట్లు ఆ సమయంలో తెలిపాడు వార్నర్. కానీ ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్​లో పరుగుల సునామీ సృష్టించాడు. ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్​గా నిలిచాడు.

ఇవీ చూడండి: 'ఫామ్​లోకి వచ్చావుగా'.. వార్నర్​పై సన్​రైజర్స్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.