ETV Bharat / sports

ఐపీఎల్​లో సారధిగా నో ఛాన్స్​.. టీమ్ఇండియాకి కెప్టెన్​గా ఆ ముగ్గురు..

author img

By

Published : Jul 17, 2023, 4:34 PM IST

ajinkya rahane captain
ajinkya rahane captain

తాము ఆడిన ఐపీఎల్​ జట్టుకి కెప్టెన్​గా వ్యవహరించలేదు ఆ ముగ్గురు టీమ్ఇండియా ప్లేయర్లు. అయినా అంతర్జాతీయ క్రికెట్​లో టీమ్​ఇండియాకు సారధిగా వ్యవహరించే అవకాశం వచ్చింది వారికి. వారెవరో ఓ సారి తెలుసుకుందామా మరి.

ఐపీఎల్​లో తాము ఆడిన జట్టుకి ప్రాతినిధ్యం వహించకుండా.. అంతర్జాతీయ క్రికెట్​లో భారత్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించిన, వ్యవహరించబోతున్న ప్లేయర్లు ఎవరో తెలుసా? వారి గురించి ఓ సారి తెలుసుకుందామా మరి.

అజింక్యా రహానే..
Ajinkya Rahane Captain : అజింక్య రహానే ఈ పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2011 నుంచి 2015 వరకు భారత్ జట్టులో అజింక్యా రహానే రెగ్యులర్ ప్లేయర్​. నిలకడైన ఆటతో రహానే ఆకట్టుకోవడం వల్ల 2015లో భారత్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించే అవకాశం అతడికి లభించింది. జింబాబ్వేతో జరిగిన 3 వన్డేల సిరీస్​, T20లకు అజింక్యా రహానే కెప్టెన్​గా వ్యవహరించాడు. వన్డే సిరీస్​ను ఇండియా వైట్​వాష్ చేయగా.. టీ20 సిరీస్​ను సమం చేసింది. ఈ సిరీస్​తో రహానేకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే 2018లో బాల్​టాంపరింగ్ ఆరోపణలతో అప్పటి రాజస్థాన్​ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో అజింక్యా రహానేను కెప్టెన్​గా నియమించింది ఆర్​ఆర్ యాజమాన్యం. IPLలో రహానే 24 మ్యాచ్‌లకు రాయల్స్‌కు నాయకత్వం వహించాడు. అందులో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించగా.. 15 మ్యాచ్​లో ఓటమిపాలైంది.ఇలాగే 2023 ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున మిడిలార్డర్​లో అజింక్యా రహానే అదరగొట్టాడు.

జస్పీత్ బుమ్రా..
Jasprit Bumrah Captain : జస్పీత్ బుమ్రా.. తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. 2013 నుంచి ముంబయి ఇండియన్స్ టీమ్​లో కీలక ఆటగాడు. ఆ జట్టు విజయాల్లో జస్పీత్ బుమ్రా చాలా సార్లు కీలకపాత్ర పోషించాడు కూడా. అతడు ముంబయి తరఫున ఆడిన 120 మ్యాచుల్లో 145 వికెట్లు పడగొట్టాడు. కీలక ప్లేయర్​ ఉన్న బుమ్రాకు ముంబయి జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించే అవకాశం రాలేదు. అయితే 2022లో ఇంగ్లాండ్​-భారత్​ మధ్య జరిగిన ఐదవ టెస్ట్​కు గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యాడు. అతడి స్థానంలో జస్పీత్ బుమ్రాను కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ. ఆ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది.

రుతురాజ్ గైక్వాడ్​..
Ruturaj Gaikwad Captain : రుతురాజ్ గైక్వాడ్​.. చెన్నై ఓపెనర్​గా అందరికీ సుపరిచితుడే. ఇటీవల ఆసియా క్రీడలకు వెళ్లే జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆ జట్టుకు రుత్​రాజ్ గైక్వాడ్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. 2023 సీజన్​లో రుత్​రాజ్ చెన్నై తరఫున ఓపెనర్​గా దిగి అదరగొట్టాడు. 15 ఇన్నింగ్స్‌లలో 590 పరుగులు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.