ETV Bharat / sports

పంత్​ ఆ స్థానంలో బ్యాటింగ్.. ప్రయోగం మాత్రమే: రోహిత్ శర్మ

author img

By

Published : Feb 10, 2022, 8:38 AM IST

rishab pant
పంత్

India vs west indies: వెస్టిండీస్​తో వన్డే సిరీస్​ గెలిచిన రోహిత్ శర్మ.. తమ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్​ను ఓపెనర్​గా తీసుకురావడం శాశ్వతమేం కాదని అన్నాడు.

Rohit sharma: పంత్​ను ఓపెనర్​గా పంపడం ప్రయోగం మాత్రమేనని టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తర్వాత వన్డేకు శిఖర్ ధావన్​ అందుబాటులోకి వస్తే, పంత్​ ఐదో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడని రోహిత్ అన్నాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం టీమ్​ సభ్యుల్ని ప్రశంసించిన రోహిత్.. వారి ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు.

"సిరీస్​ గెలవడం ఎప్పుడూ ఆనందమే. ఈరోజు మేం కొన్ని కఠిన సవాళ్లు ఎదుర్కొన్నాం. కేఎల్ రాహుల్, సూర్య నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. మా జట్టుకు కావాల్సింది అలాంటి ఇన్నింగ్స్​లే. సూర్య ఆడిన ఇన్నింగ్స్​ అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే పంత్​ను ఓపెనర్​గా పంపించాం. ఇది శాశ్వతం కాదు. టీమ్​ఇండియా బౌలింగ్​లో ఇంత మంచి స్పెల్​ చూడలేదు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు" అని రోహిత్ శర్మ చెప్పాడు.

team india
టీమ్​ఇండియా

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా.. 50 ఓవర్లలో 237/9 స్కోరు చేసింది. సూర్యకుమార్ 64, కేఎల్ రాహుల్ 49 పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో విండీస్ 193 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్​ను 0-2 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.