ETV Bharat / sports

IPL: ఐపీఎల్​లో ఆసీస్ క్రికెటర్లు ఆడతారా.. లేదా?

author img

By

Published : May 31, 2021, 6:42 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో(IPL) ఆసీస్ ఆటగాళ్లు ఆడే విషయం ఇంకా చర్చల్లోనే ఉందని ఆ దేశ బోర్డు తెలిపింది. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ టోర్నీ.. సెప్టెంబరులో యూఈఏ వేదికగా జరగనుంది.

CA yet to discuss Australian players' participation in remaining IPL matches in UAE
ఐపీఎల్ కమిన్స్

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్​లను యూఏఈ(UAE)లో జరపనున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్​ల్లో ఇంగ్లాండ్​ క్రికెటర్లు ఆడరని తేలిపోయింది. ఇప్పుడు తమ దేశ ఆటగాళ్లు మిగిలిన సీజన్​లో ఆడేది లేనిది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) సోమవారం వెల్లడించింది.

ఐపీఎల్​ వాయిదా పడిన తర్వాత గత కొన్నిరోజుల నుంచి క్వారంటైన్​లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. తమ కుటుంబాలతో సోమవారమే కలిశారు. త్వరలో జట్టుగా కలవనున్న ఆటగాళ్లు.. జులైలో వెస్టిండీస్ పర్యటనకు, ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్​ కోసం బంగ్లాదేశ్​​ వెళ్తారు.

IPL 2021
ఐపీఎల్ ట్రోఫీ

అయితే ఐపీఎల్ మిగతా మ్యాచ్​లు​ జరపాలనుకుంటున్న సెప్టెంబరు-అక్టోబరులో ఆసీస్​కు ఎలాంటి సిరీస్​లు లేవు. కాబట్టి ఆ దేశ ఆటగాళ్లు.. సీజన్​లో ఆడే విషయమై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి?

ఇది చదవండి: IPL 2021: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.