ETV Bharat / sports

విండీస్​తో రెండో టెస్ట్​.. క్వీన్స్ పార్క్​ వేదికపై నమోదైన రికార్డులివే!

author img

By

Published : Jul 20, 2023, 1:53 PM IST

india vs west indies
india vs west indies

India Vs West Indies Records : వెస్టిండీస్​తో మరి కొన్ని గంటల్లో రెండో​ టెస్ట్.. ​ క్వీన్స్​ పార్క్ వేదికగా జరగనుంది. ఈ వేదికపై ఇరు జట్ల రికార్డులను ఓ లుక్కేద్దాం...

Ind Vs WI Test : వెస్టిండీస్​తో మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానున్న రెండో​ టెస్ట్​ కోసం టీమ్​ఇండియా సిద్ధంగా ఉంది. మొదటి టెస్టులోనే విండీస్​​ టీమ్​ను తమ సొంత గడ్డపై చిత్తు చేసిన రోహిత్​ సేన.. క్వీన్స్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్​లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. యశ్వస్వి జైస్వాల్​ ,ఇషాన్ కిషన్​ లాంటి యంగ్​ ప్లేయర్స్​తో పాటు రోహిత్​, కోహ్లీ, రహానే లాంటి మేటి ప్లేయర్స్​ కలయికతో ఏర్పడిన తుది జట్టు అందరి అంచనాలను దాటి ప్రత్యర్థులను చిత్తు చేసింది. ఇక రెండో టెస్ట్​కు కూడా ఇదే టీమ్​తో కొనసాగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఓ వైపు విరాట్​ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్​ ఆడి తన కెరీర్​లో ఓ మైలు రాయిని దాటనున్నాడు. ఇక దశాబ్దాలుగా వెస్టీండీస్​తో భారత్​ తలపడి గెలుపోటమల పోరటాంలో ఈదుతూ వచ్చింది. ఇక అనేక వేదికలపై ఈ జట్టు జట్లు ఎన్నో రికార్డులు నెలకొల్పాయి. అవేంటంటే..

వెస్టిండీస్ vs ఇండియా రికార్డులు:

  • ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 99 గేమ్‌లు ఆడాయి. అందులో వెస్టిండీస్ 30 గెలిచి ఆధిక్యతను చాటుకోగా.. భారత్ 23 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మరో 46 గేమ్‌లు డ్రాగా ముగిశాయి.
  • విండీస్​ వేదికగా ఇరు జట్లు 52 సార్లు తలపడగా..అందులో భారత్​ 10 గెలవగా.. 16 విజయాలు విండీస్​ సేన సొంతమైంది. ఇక 26 డ్రా గా ముగిశాయి.
  • టెస్టులో భారత్‌పై వెస్టిండీస్ అత్యధిక స్కోరు 644 కాగా.. అత్యల్ప స్కోరు 100
  • వెస్టిండీస్‌పై భారత్ అత్యధిక స్కోరు 649 కాగా, వారి అత్యల్ప స్కోరు 75గా నమోదైంది.

క్వీన్స్ వేదిక​ రికార్డులు ఇవే..

  • ఇక ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ పేసర్లకు బాగా అనకూలిస్తుంది.
  • ఇప్పటి వరకు ఈ స్టేడియంలో జరిగిన 61 మ్యాచ్‌ల్లో పేసర్లు 27.39 సగటుతో 1157 వికెట్లు తీయగా.. స్పిన్ బౌలర్లు 36.57 సగటుతో 626 వికెట్లు తీశారు.
  • ఈ వేదికపై ఆడిన మొదటి మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో సాధించిన స్కోరు 302.
  • క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో ఆడిన 13 టెస్టుల్లో భారత్‌ సాధించిన విజయాలు 3. మరో 3 మ్యాచ్‌లు ఓడిపోగా.. మిగతా 7 డ్రా చేసుకుంది.
  • ఇక టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్‌కు 14 వికెట్లు అవసరం. అతడు మొదటి మ్యాచ్​ దూకుడును కొనసాగిస్తే ఈ సిరీస్​లో అది సాధ్యమవుతోంది.
  • భారత్‌తో వందో టెస్టు ఆడనున్న మూడో జట్టు విండీస్‌. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఇప్పటికే ఆ మైలురాయిని అందుకున్నాయి.
  • కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌. అతను ఇప్పటిదాకా 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.