ETV Bharat / sports

India Pakistan Series : 'భారత్​-పాక్​ సిరీస్​ కోసం PCB డిమాండ్​.. అంతా సర్కార్​ చేతుల్లోనే!'

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 5:31 PM IST

Etv Bharat
Etv Bharat

India Pakistan Series : భారత్​, పాకిస్థాన్​ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ కోసం పీసీబీ డిమాండ్​ చేస్తుందని బీసీసీఐ వైస్​ ప్రెసిడెంట్​ రాజీవ్​ శుక్లా తెలిపారు. పీసీబీ ఆహ్వానం మేరకు.. పాకిస్థాన్​కు వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్​ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా తిరిగి భారత్​కు​ చేరుకున్నారు. తమ పర్యటన అద్భుతంగా సాగిందని వెల్లడించారు.

India Pakistan Series : భారత్​- పాకిస్థాన్​ మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని ఆ దేశ క్రికెట్​ బోర్డు డిమాండ్​ చేస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా తెలిపారు. అయితే అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు, ఆసియా క్రికెట్ కౌన్సిల్​ ఆహ్వానం మేరకు మ్యాచ్​లు చూసేందుకు పాక్​కు వెళ్లిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్​ బిన్నీ, వైస్​ ప్రెసిడెంట్​ రాజీవ్​ శుక్లా.. భారత్​కు చేరుకున్నారు. పంజాబ్​లోని అమృత్​సర్​ సరిహద్దు ప్రాంతమైన అట్టారీ- వాఘ్​ బోర్డర్​ ద్వారా భారత్​కు విచ్చేశారు.

'పాక్​ పర్యటన అద్భుతం'
BCCI Vice President Pak Visit : పాక్​లో రెండు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా తెలిపారు. పీసీబీ ఆతిథ్యం బాగుందని చెప్పారు. "అక్కడి గవర్నర్.. ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. శ్రీలంక, పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ ఆటగాళ్లను కలిశాం. రెండు దేశాల మధ్య సిరీస్​ కోసం (పీసీబీ) డిమాండ్ చేస్తోంది. క్రికెట్​ సంబంధాలు పునరుద్ధరించాలని కోరారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. వాళ్లు (కేంద్ర ప్రభుత్వం) ఏం చెబితే మేం అదే చేస్తాం. ఇది పూర్తిగా క్రికెట్​ పర్యటన. ఎలాంటి రాజకీయ అజెండా లేదు" అని మరోసారి రాజీవ్​ తేల్చిచెప్పారు.

'రాజుల్లా చూసుకున్నారు!'
BCCI President Pak Visit : పాకిస్థాన్​ పర్యటనను అద్భుతమైన అనుభవంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్​ బిన్నీ వర్ణించారు. పీసీబీ ఆతిథ్యం చాలా బాగుందని చెప్పారు. "పాక్​ పర్యటన ఓ అద్భుతమైన అనుభవం. 1984లో టెస్ట్ మ్యాచ్​ కోసం పాక్​కు వెళ్లినప్పుడు.. మాకు అలాంటి ఆతిథ్యమే ఇచ్చారు. మమ్మల్ని రాజుల్లా చూసుకున్నారు. పాకిస్థాన్​ అధికారులందరినీ మర్యాదపూర్వకంగా కలిశాం. మేము పాక్​కు వెళ్లడం వాళ్లకు ఎంతో ఆనందంగా ఉందో.. మాకు కూడా అంతే ఆనందంగా ఉంది" అని రోజర్​ బిన్నీ తెలిపారు.

2008లో చివరసారిగా..
India Pakisthan Last Visit : దౌత్యపరమైన ఇబ్బందులు కారణంగా భారత్​, పాకిస్థాన్​ జట్ల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్​లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, బీసీసీఐ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లింది. అయితే 2012లో టెస్ట్ మ్యాచ్​ కోసం భారత్​కు వచ్చిన పాక్​ జట్టు.. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్​కు రానుంది.

సెప్టెంబర్​ 10న భారత్​x పాక్ మ్యాచ్​
Asia Cup 2023 Super Four : ఆసియా కప్​ 2023లో భాగంగా బంగ్లాదేశ్​, పాకిస్థాన్​ల మధ్య సూపర్​-4 మ్యాచ్.. బుధవారం జరగనుంది. ఇప్పటికే సూపర్​-4కు గ్రూప్​-ఎ నుంచి పాకిస్థాన్​, భారత్​.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్​ అర్హత సాధించాయి. సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌తో.. 12న శ్రీలంకతో.. 15న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. సెప్టెంబర్​ 17వ తేదీన ఫైనల్​ జరగనుంది.

Asia cup 2023 Ind VS Pak : భారత్ వర్సెస్ పాక్​.. ఎవరి బౌలింగ్ ఎలా ఉందంటే?

Asia Cup 2023 Venue : భారీ వర్షాల ఎఫెక్ట్​.. భారత్​-పాక్​ వాషౌట్​తో కీలక నిర్ణయం.. వేదికల్లో మార్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.