ETV Bharat / sports

టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్​.. ఆ ఇద్దరు వస్తున్నారు!

author img

By

Published : Feb 8, 2022, 3:48 PM IST

Dhawan Iyer: వెస్టిండీస్​తో రెండో వన్డేకు ముందు టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్. కరోనా బారినపడిన భారత క్రికెటర్లు శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​కు కొవిడ్​ నెగెటివ్​గా తేలింది.

Shikhar Dhawan, Shreyas Iyer test COVID-19 negative
Shikhar Dhawan, Shreyas Iyer test COVID-19 negative

Dhawan Iyer: వెస్టిండీస్​తో వన్డే సిరీస్​కు ముందు కరోనా బారినపడ్డ భారత ఓపెనర్ శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​కు.. కొవిడ్​ నెగెటివ్​గా తేలింది. ఇరువురికీ ప్రాక్టీస్​ చేసుకొనే వెసులుబాటు కల్పించింది బీసీసీఐ.

Shikhar Dhawan, Shreyas Iyer test COVID-19 negative
శిఖర్​ ధావన్​

''శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​కు కరోనా నెగెటివ్​గా నిర్ధరణ అయింది. వారు ఇక ప్రాక్టీస్​ చేసుకోవచ్చు. రుతురాజ్​ గైక్వాడ్​ మాత్రం ఇంకా ఐసోలేషన్​లో ఉన్నాడు.''

- అధికార వర్గాలు

Ind vs Wi Odi: ఫిబ్రవరి 9న రెండో వన్డేకు ముందు.. మంగళవారం(ఫిబ్రవరి 8) సాయంత్రం ప్రాక్టీస్​ చేయనుంది టీమ్​ఇండియా. ధావన్​, అయ్యర్​.. ఈ సెషన్​లో పాల్గొంటారని క్రికెట్​ వర్గాలు వెల్లడించాయి.

తొలి వన్డేకు ముందు.. ధావన్​, అయ్యర్​, రుతురాజ్​ గైక్వాడ్​, బౌలర్​ నవదీప్​ సైనీలకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఫీల్డింగ్ కోచ్​ దిలీప్​ సహా మరో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా వైరస్​ బారిన పడ్డారు. దీంతో వీరంతా ఆ మ్యాచ్​కు దూరమయ్యారు. అయినా.. భారత్​ ఘనవిజయం సాధించింది. వీరి గైర్హాజరీలో ఇషాన్​ కిషన్​, ప్రసిద్ధ్​ కృష్ణ, దీపక్​ హుడాలకు ఆడే అవకాశం లభించింది.

వెస్టిండీస్​ను 176 పరుగులకే ఆలౌట్​ చేసి.. 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత చాహల్​ 4, వాషింగ్టన్​ సుందర్​ 3.. స్పిన్​ మాయాజాలంతో విండీస్​ కుప్పకూలింది. అనంతరం.. బ్యాటింగ్​లో కెప్టెన్​ రోహిత్​ శర్మ(60) అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం వరుసగా వికెట్లు పోయినా.. సూర్యకుమార్​ యాదవ్​, హుడా విజయాన్ని అందించారు.

రెండో వన్డే 9న, మూడో వన్డే 11న అహ్మదాబాద్‌లో.. టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి.

ఇవీ చూడండి: గంగూలీ సలహాను పక్కనపెట్టిన హార్దిక్..

IPL 2022: ప్రపంచకప్‌ గెలిచినా వేలానికి అనర్హులే! ఎందుకంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.