ETV Bharat / sports

IND VS SL: మూడో టీ20లో లంకపై భారత్​ విజయం.. సిరీస్​ మనదే

author img

By

Published : Jan 7, 2023, 10:16 PM IST

Updated : Jan 7, 2023, 10:38 PM IST

లంకతో జరిగిన మూడో టీ20లో టీమ్​ఇండియా విజయం సాధించింది. 91 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచుల సిరీస్​ను 2-1తేడాతో చేజిక్కిచుకుంది.

IND VS SL Teamindia won the match Third T20 match
మూడో టీ20లో శ్రీలంకపై టీమ్​ఇండియా విజయం

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్​ఇండియా 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచుల సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టీ20 సిరీస్‌ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక బ్యాటర్లలో శానక (23), ధనంజయ (22), అసలంక (19) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, హార్దిక్ 2, ఉమ్రాన్‌ మాలిక్ 2, చాహల్ 2, అక్షర్‌ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్‌ (112; 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతకం బాదాడు. శుభ్‌మన్‌ గిల్ (46), రాహుల్‌ త్రిపాఠి (35), అక్షర్‌ పటేల్ (21) రాణించారు. లంక బౌలర్లలో మదుశంక రెండు.. రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: IND VS SL: సూర్యకుమార్​ మెరుపు సెంచరీ.. గ్రౌండ్​లో సిక్సర్ల సునామీ..​ లంక లక్ష్యం ఎంతంటే?

Last Updated : Jan 7, 2023, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.