ETV Bharat / sports

'మా కుర్రాళ్లకు ఇచ్చిన మెసేజ్‌ అదే- అందుకే సంజుకు అప్పట్లో ఛాన్సులు రాలేదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 11:57 AM IST

IND VS SA Odi Series Kl Rahul
IND VS SA Odi Series Kl Rahul

IND VS SA Odi Series Kl Rahul : దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​ను కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని భారత క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్​ రాహుల్ తెలిపాడు. జాతీయ జట్టులో సంజూ శాంసన్​కు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా వివరించాడు!

IND VS SA ODI Series Kl Rahul : దక్షిణాఫ్రికా గడ్డపై ఆరేళ్ల తర్వాత వన్డే సిరీస్​ను గెలుచుకుంది టీమ్​ఇండియా. ఆల్​రౌండ్​ షోతో మూడు వన్డేల సిరీస్​ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో సంజూ శాంసన్​ అదరగొట్టేశాడు. బౌలింగ్​లో అర్షదీప్ అండ్​ కో దుమ్మురేపారు. అయితే సిరీస్ విజయం తర్వాత టీమ్​ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా సారథి మార్​క్రమ్​ మాట్లాడారు.

కెరీర్​లో తొలి సెంచరీ సాధించిన సంజూ శాంసన్​కు కేఎల్​ రాహుల్ కొనియాడాడు. "కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టా. వన్డే సిరీస్‌ గెలవడం ఆనందంగా ఉంది. ఈ జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. యువ క్రికెటర్లకు నేనిచ్చే సందేశం ఒక్కటే. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు" అని రాహుల్ చెప్పాడు.

"జట్టులో యంగ్​ క్రికెటర్లను పాత్రను గుర్తు చేశాను. ఇప్పుడున్నవారిలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ, కొందరికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేదు. అయినా వంద శాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు. కానీ, జాతీయ జట్టుకు వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల టాప్‌ఆర్డర్‌లో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈ మ్యాచ్​లో మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు"

--కేఎల్ రాహుల్, టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్

అయితే కీలకమైన మూడో వన్డేలో ఓడిపోవడం తీవ్రంగా బాధించిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్​క్రమ్​ తెలిపాడు. "పార్ల్‌ మైదానం చాలా బాగుంది. భారీగా అభిమానులు మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చారు. వారిని మేం నిరాశపరిచాం. జట్టులోని సభ్యులంతా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. కానీ, సరైన దిశగా పయనించలేకపోయాం. చివరి వరకూ పిచ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. భారత్‌ నిర్దేశించిన 290 పైచిలుకు లక్ష్యం ఛేదించగలమని భావించాం. బౌలింగ్‌లో బాగానే రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో వెనకబడ్డాం. టాస్‌ అంశం కీలకమే కాదు. రాబోయే టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. దక్షిణాఫ్రికాలోని రెండు గొప్ప మైదానాల్లో టెస్టులు జరగబోతున్నాయి. క్రికెట్‌ అభిమానులకు ఇది పండగే" అని మార్‌క్రమ్‌ తెలిపాడు.

సెంచరీ తర్వాత సంజూ సూపర్ సెలబ్రేషన్​ - వారికి స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడుగా!

'నా కష్టం మీకు తెలియదు, తెలుగు కుర్రాడు అదుర్స్'- రాహుల్, అర్షదీప్ రికార్డులే రికార్డులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.