ETV Bharat / sports

హార్దిక్​ పాండ్య అరుదైన ఘనత.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన ఆల్​రౌండర్​

author img

By

Published : Mar 7, 2023, 12:30 PM IST

hardik pandya instagram followers
hardik pandya instagram followers

టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్​ హార్దిక్​ పాండ్య అరుదైన ఘనత సాధించాడు. ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన సెలెబ్రిటీల జాబితాలో చేరాడు. ఈ సందర్బంగా తన భార్య నటాషా అడిగిన 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.

టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య అరుదైన ఘనత సాధించాడు. ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక ఫాలోవర్స్​ కలిగిన క్రీడాకారుల్లో చోటు సంపాదించుకున్నాడు. నాదల్, రోజర్ ఫెదరర్, మ్యాక్స్ వెర్స్‌టాపెన్, ఎర్లింగ్ లాంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి పాండ్య ఈ ఘనత సాధించాడు. ఈ మేరకు తన ఇన్​స్టా ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు

హార్దిక్​ పాండ్య ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల(2.5 కోట్లు) ఫాలోవర్లతో సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆతడి భార్య నటాషా స్టాన్​కోవిక్​ అడిగిన 25 ప్రశ్నలకు హార్దిక్ పాండ్య సమాధానాలిచ్చాడు. ఎక్కువ ఫాలోవర్లు ఉన్న లిస్టులో.. దిగ్గజ క్రీడాకారులు నాదల్, రోజర్ ఫెదరర్, మ్యాక్స్ వెర్స్‌టాపెన్, ఎర్లింగ్ను అధిగమించాడు. ఈ ఘనత దక్కినందుకు తన అభిమానులకు, ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. "నాపై ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్​కు థ్యాంక్స్​. నాకు ప్రతి ఒక్కరి అభిమానం ప్రత్యేకమే. ఇన్నేళ్లుగా నాపై ప్రేమను కురిపిస్తూ మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను." అని హార్దిక్ పాండ్య పోస్టు పెట్టాడు. ఇన్​స్టాలోనే కాకుండా ట్విట్టర్​లోనూ హార్దిక్​ పాండ్యకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో పాండ్యకు దాదాపు 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

హార్దిక్​ పాండ్య అటు కెరీర్​లో.. ఇటు పర్సనల్​ లైఫ్​లో దూసుకుపోతున్నాడు. టీమ్​ఇండియా టీ20 ఫార్మాట్​ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన పాండ్య.. తన ప్రేయసిని రెండో వివాహం చేసుకున్నాడు. ఉదయ్‌పుర్ వేదికగా రెండేళ్ల కుమారుడు అగస్త్య సాక్షిగా నటాషాను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 2020 కోవిడ్ లాక్డౌన్​ సమయంలో వివాహం చేసుకున్నారు. అప్పుడు చిన్నగా చేసుకోవడం వల్ల.. ఇప్పుడు ఘనంగా హిందూ, క్రిస్టియన్​ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ భాగంగాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సరీస్​కు హార్దిక్ దూరంగా ఉన్నాడు. ఈ ట్రోఫీలో ఇప్పటికే మూడు మ్యాచ్​లు పూర్తయ్యాయి. 2-1 తేడాతో భారత్​ అధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో మ్యాచ్​ మార్చి 9 నుంచి జరగనుంది. అయితే కంగారూలతో జరగబోయే వన్డే సిరీస్​కు హార్దిక్​ అందుబాటులో ఉంటాడు.

అయితే, జనవరి 2023 వరకు ఇన్​స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా క్రిస్టియానో రోనాల్డో నిలిచాడు. అతడికి 539 మిలియన్లు ఫాలోవర్లు ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో సాకర్​ వీరుడు లియోనెల్ మెస్సీ(424 మిలియన్లు), అమెరికా మీడియా పర్సనాలిటి, వ్యాపార వేత్త కైల్​ జెన్నెర్​(379 మిలియన్లు), సింగర్​ సెలీనా గోమెజ్​(373 మిలియన్లు), మాజీ రెజ్లర్​, హాలీవుడ్ నటుడు ది రాక్​ (360) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.