ETV Bharat / sports

T20 Worldcup: కరోనా భయం.. వీక్షకుల కోసం స్పెషల్ సీటింగ్

author img

By

Published : Oct 23, 2021, 5:41 PM IST

seating
సీటింగ్

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ సూపర్-12 తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది దక్షిణాఫ్రికా(AUS vs SA t20 match). ఈ మ్యాచ్​లో అభిమానుల సందడి అందరి దృష్టినీ ఆకర్షించింది. కరోనా కారణంగా వారి కోసం స్పెషల్​ సీట్లు ఏర్పాటు చేసింది అబుదాబి మైదానం యాజమాన్యం.

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) సూపర్​-12 దశలో భాగంగా తొలి మ్యాచ్​ నేపథ్యంలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. అబుదాబిలోని షేక్ జావేద్ మైదానంలో జరుగుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్(AUS vs SA match)​ సందర్భంగా ఈ సన్నివేశం వెలుగుచూసింది. మైదానంలో అభిమానుల సీటింగ్​ విధానం అందరి దృష్టినీ ఆకర్షించింది.

అభిమానులతో సందడిగా ఉండే మైదానాలు కొవిడ్​ నిబంధనల కారణంగా చిన్నబోయాయి. అయితే.. టీ20 ప్రపంచకప్​ కోసం పరమిత సంఖ్యలో అభిమానులకు అనుమతినిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

అయితే.. కొంతమంది అభిమానులు కేటాయించిన సీట్లలో కూర్చుని ఈ మ్యాచ్​ను తిలకిస్తుండగా.. మరికొందరు ఫీల్డ్​కు బయట ఉన్న స్పెషల్​ బాక్సుల్లో కూర్చొని చిల్​ కొడుతున్నారు. మైదానం యాజమాన్యమే కొవిడ్​ నిబంధనల దృష్ట్యా ఈ స్పెషల్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఒక బాక్సులో ముగ్గురి కంటే ఎక్కువ మంది కూర్చునే సౌలభ్యాన్ని కల్పించింది.

మ్యాచ్​ విషయానికొస్తే టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్ విఫలమయ్యారు. మర్క్​రమ్ (40) పోరాడిన ఫలితంగా ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.

ఇదీ చదవండి:

T20 World Cup: భారత్​పై గెలిస్తే పాక్ ఆటగాళ్లకు భారీ బోనస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.