ETV Bharat / sports

'పంత్​ కోలుకుంటున్నాడు.. తదుపరి చికిత్స నిమిత్తం ముంబయి తరలిస్తున్నాము'

author img

By

Published : Jan 4, 2023, 12:05 PM IST

Updated : Jan 4, 2023, 12:18 PM IST

Cricketer Rishabh pant
Cricketer Rishabh pant

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్రికెటర్​ రిషభ్​ పంత్​ను తదుపరి ట్రీట్మెంట్​ కోసం ముంబయికి తరలిస్తున్నట్లు డీడీసీఏ డైరెక్టర్​ శ్యామ్​ శర్మ తెలిపారు.

ప్రస్తుతం దెహ్రాదూన్​లో చికిత్స పొందుతున్న టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్​ను తదుపరి ట్రీట్మెంట్​ కోసం ముంబయికు తరలిస్తున్నట్లు డీడీసీఏ డైరెక్టర్​ శ్యామ్​ శర్మ తెలిపారు. కారు ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలపలైన పంత్​ను దెహ్రాదున్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు.​ అక్కడ అతడికి పలు శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు మొదట ఐసీయూలో ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించిన పంత్​ను ఓ స్పెషల్​ వార్డుకు తరలించారు. ఇప్పుడు ముంబయిలో తదుపరి చికిత్స అందించనున్నారు. అక్కడి లీలావతి ఆసుపత్రికి తరలించి అతడికి లిగ్​మెంట్ చికిత్స అందించనున్నారని కాన్పుర్​ ఎమ్మెల్యే ఉమేశ్​ కుమార్ తెలిపారు.

కాగా, ఇటీవలే తన వస్తువులను భద్రంగా తెచ్చి తిరిగి ఇచ్చిన ఇద్దరు యువకులను ఆస్పత్రిలో కలిశాడు పంత్​. వారి నిజాయతీకి మెచ్చుకున్న పంత్​ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం వైరలవుతోంది. అందులో కేవలం పంత్​ చేయి మాత్రమే కనిపిస్తున్నప్పటికీ ఫ్యాన్స్​.. 'ఇది చాలు తను కోలుకుంటున్నాడు అనడానికి అని'.. అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated :Jan 4, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.