ETV Bharat / sports

ఐపీఎల్2020: నెట్టింట ధోనీ అభిమానుల సందడి

author img

By

Published : Sep 19, 2020, 10:01 AM IST

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్​ మొదలవనుంది. చాలా కాలం తర్వాత ధోనీ రాకతో అతడి అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా 'ధోనీ ఈజ్ బ్యాక్' అనే​ హ్యాష్ ​ట్యాగ్​ ట్రెండింగ్​లో నిలిచింది.

MS Dhoni
ధోనీ

మరికొన్ని గంటల్లో ఐపీఎల్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సోషల్ ​మీడియాలో అభిమానుల​ సందడి మొదలైంది. నేడు రాత్రి 7.30గంటలకు ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. అయితే ఈ లీగ్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ధోనీ. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన మహీ.. ఐపీఎల్​తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ తరుణం కోసమే అతడి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ వేదికగా 'ధోనీ ఈజ్​ బ్యాక్'​, 'వెల్కమ్​ బ్యాక్​ మై డియర్​ తాలా' వంటి హ్యాష్ ట్యాగ్​తో మహీ అభిమానులు సందడి చేస్తున్నారు.

  • ▬▬▬.◙.▬▬▬
    ═▂▄▄▓▄▄▂
    ◢◤ █▀▀████▄▄▄▄◢◤
    █▄ █ █▄ ███▀▀▀▀▀▀▀╬
    ◥█████◤
    ══╩══╩═
    ╬═╬
    ╬═╬
    ╬═╬
    ╬═╬
    ╬═╬
    ╬═╬☻/
    ╬═╬/▌
    ╬═╬/ \

    HELICOPTER is Back !!😎🔥#WelcomeBackDhoni

    — DHONI Army TN™ (@DhoniArmyTN) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.