ETV Bharat / sports

కెప్టెన్లకు గాయాలు.. ఐపీఎల్​ ఫ్రాంచైజీల్లో భయం!

author img

By

Published : Mar 25, 2021, 10:19 AM IST

injury scars of shreyas, rohit, morgan.. ipl franchises on fear!
కెప్టెన్లకు గాయాలు.. ఐపీఎల్​ ఫ్రాంచైజీల్లో భయం!

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​లో ఆడుతూ గాయపడ్డ వారిలో ముగ్గురు క్రికెటర్లు ఐపీఎల్​లో కెప్టెన్లుగా ఉన్నారు. దీంతో వీరు లీగ్​లో ఆడకపోయే పరిస్థితి వస్తుందేమోనని ఫ్రాంచైజీలు భయపడుతున్నాయి.

భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్​ ఆడుతున్న పలువురు క్రికెటర్లు గాయాలపాలవుతున్నారు. దీంతో పలు ఐపీఎల్​ ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. సీజన్​కు వారు అందుబాటులో ఉంటారా? లేదా? భయపడుతున్నాయి.

shreyas Iyer injury
శ్రేయస్ అయ్యర్

అసలు ఏమైంది?

పుణెలో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఈ మ్యాచ్​లో గాయపడిన శ్రేయస్ అయ్యర్.. తర్వాత రెండు వన్డేలకు దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్​లోనూ ఇతడు ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. ఇదే మ్యాచ్​లో రోహిత్ శర్మ మోచేయికి బంతి తగలడం వల్ల ఫీల్డింగ్​కు రాలేదు. మరి రెండో వన్డేలో హిట్​మ్యాన్ ఆడతాడో లేదో?

మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్​ మోర్గాన్​తో పాటు సామ్ బిల్లింగ్స్ గాయల బారిన పడ్డారు. సిరీస్​లోని మిగతా మ్యాచ్​లు వీరిద్దరూ ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

morgan ipl injury
ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్

పైన చెప్పిన నలుగురు క్రికెటర్లలో ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్లుగా ఉన్నారు. రోహిత్ శర్మ -ముంబయి ఇండియన్స్, శ్రేయస్ అయ్యర్-దిల్లీ క్యాపిటల్స్, మోర్గాన్-కోల్​కతా నైట్​రైడర్స్.. ఒకవేళ వీరు ఐపీఎల్​ ఆడకపోతే ఆ జట్లకు ఎవరు సారథ్యం వహిస్తారో మరి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.