ETV Bharat / sitara

మెగా బ్యానర్​లో సూపర్ స్టార్ సినిమా!

author img

By

Published : Feb 18, 2020, 8:59 AM IST

Updated : Mar 1, 2020, 4:56 PM IST

సూపర్ స్టార్
సూపర్ స్టార్

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఓ కథ చెప్పాడట. అది మహేశ్​కు బాగా నచ్చిందని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. అయితే ఈ మూవీకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట.

'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్నందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం కాస్త విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ప్రిన్స్ తర్వాతి సినిమాపై టాలీవుడ్​లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.​

మహేశ్ బాబు ,‘'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే వార్తలు చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ప్రశాంత్.. మహేశ్ బాబుకు ఒక స్టోరీ లైన్ చెప్పాడని, అది మహేశ్​కు బాగా నచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్.

అయితే మహేశ్.. ప్రశాంత్ నీల్​ను మెగా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వద్దకు కథ వినిపించేందుకు పంపాడట. అన్నీ కుదిరితే త్వరలోనే ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయట. అంటే వీరిద్దరి కాంబినేషన్​లో రూపొందబోయే సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహించడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

Last Updated :Mar 1, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.