ETV Bharat / sitara

మహేశ్​ ఫ్యాన్స్​కు శుభవార్త.. అప్​డేట్​తో 'సర్కారు వారి పాట'

author img

By

Published : Jul 29, 2021, 6:38 PM IST

Sarkaru Vaari Paata
సర్కారు వారి పాట

మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' నుంచి అప్​డేట్​ రానుంది. జులై 31న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినిమాల షూటింగ్​లు జోరందుకున్నాయి. అలాగే థియేటర్లూ ఓపెన్ కావడం వల్ల రిలీజ్ డేట్స్, ప్రమోషన్లు, అప్​డేట్స్ అంటూ చిత్రబృందాలు హడావుడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్​ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట' నుంచి అప్​డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం. జులై 31న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్​ నోటీస్​ ఇస్తామని తెలిపారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. బ్యాంకుల ఎగవేత నేపథ్య కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని​ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్​బాబు సరికొత్త లుక్​లో స్టైలిష్​గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి 'సర్కారువారి పాట' రానుంది.

ఇవీ చూడండి: పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.