ETV Bharat / sitara

'రాధేశ్యామ్' అప్డేట్: ఉత్తరాది, దక్షిణాదిలో ఒక్కొక్కరు

author img

By

Published : Feb 12, 2021, 6:32 AM IST

Radhe Shyam to have music composers from across industries
'రాధేశ్యామ్' అప్డేట్: ఉత్తరాది, దక్షిణాదిలో ఒక్కొక్కరు

ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దక్షిణాదికి ఒకరు, ఉత్తరాదికి మరొకరు సంగీత దర్శకుల్ని అధికారికంగా ఖరారు చేశారు.

'బాహుబలి'.. 'సాహో' చిత్రాలతో మంచి యాక్షన్‌ హంగామాను ప్రేక్షకులకు అందించారు హీరో ప్రభాస్‌. 'రాధేశ్యామ్‌'తో ఓ చక్కటి ప్రేమకథను సినీప్రియులకు రుచి చూపించనున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పుడీ పాన్‌ ఇండియా సినిమా కోసం ఇద్దరు సంగీత దర్శకుల్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు.

Radhe Shyam to have music composers from across industries
రాధేశ్యామ్ మూవీ న్యూస్

ఈ చిత్రానికి దక్షిణాదిలోని అన్ని భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించనుండగా.. హిందీ వెర్షన్‌కు మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీతం అందించనున్నట్లు యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ఓ విభిన్నమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యముంది. ఇప్పటికే పాటలు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.