ETV Bharat / sitara

పునీత్​కు నివాళిగా స్పెషల్ ప్రోగ్రాం.. చిరంజీవి, అల్లు అర్జున్ హాజరు!

author img

By

Published : Nov 16, 2021, 12:45 PM IST

Updated : Nov 16, 2021, 2:00 PM IST

కన్నడ పవర్​స్టార్​ పునీత్​ ఘనంగా నివాళి అర్పించేందుకు చిత్రపరిశ్రమ సిద్ధమైంది. 'పునీత్ గీత నామన' పేరుతో మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

Puneeth Geetha namana programme
పునీత్ రాజ్​కుమార్

*ఇటీవల మరణించిన అగ్రకథానాయకుడు పునీత్ రాజ్​కుమార్​కు సంతాపం తెలియజేస్తూ 'పునీత్ గీత నామన' పేరుతో ఈ రోజు(నవంబరు 16) ప్రత్యేక కార్యక్రమం​ నిర్వహిస్తున్నారు. పునీత్​కు నివాళిగా మంగళవారం షూటింగ్​లు, ఇతర కార్యకలాపాలన్నీ నిలిపివేశారు.

*మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఈ ఈవెంట్.. దాదాపు మూడు గంటలపాటు జరగనుంది.

*బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్​లో జరిగే ఈ కార్యక్రమానికి శాండల్​వుడ్​ సెలబ్రిటీలతో పాటు తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్​తో పాటు తమిళ కథానాయకుడు సూర్య తదితరులు హాజరు కానున్నారు.

Puneeth Geetha namana programme
పునీత్ రాజ్​కుమార్

*కరోనా ప్రభావం కారణంగా 'పునీత్ గీత నామన' కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరవుతారు.

*పునీత్ రాజ్​కుమార్​పై ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని ఈ ఈవెంట్​లో ఆలపించనున్నారు.

*కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

*పునీత్​రాజ్​కుమార్..అక్టోబరు 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్చించుకోలేకపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 16, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.