పునీత్​కు పాటతో ఘనమైన నివాళి.. ప్రేక్షకులకు గూస్​బంప్స్!

author img

By

Published : Nov 14, 2021, 4:21 PM IST

punith rajkumar

హఠాన్మరణంతో అభిమానుల్ని శోకాన్ని మిగిల్చిన పునీత్​ సేవల్ని మరోసారి గుర్తుచేసుకుంది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఆయనకు పాటతో ఘనమైన నివాళి అర్పించింది. ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

ఈటీవీలో ప్రతివారం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(sridevi drama company actors names).. కన్నడ స్టార్ పునీత్​రాజ్​కుమార్​కు(punith rajkumar movies) ఘనంగా నివాళి అర్పించింది. ఆయన చేసిన మంచి పనుల్ని మరోసారి గుర్తుచేసుకుని పాటతో సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పిన జడ్జి ఇంద్రజ(indraja sridevi drama company dance), హైపర్ ఆది.. ప్రేక్షకుల్ని మనసుల్ని భావోద్వేగానికి గురిచేశారు.

punith rajkumar
పునీత్ రాజ్​కుమార్
punith rajkumar
పునీత్ రాజ్​కుమార్

నవంబరు 21న ప్రసారమయ్యే ఎపిసోడ్​ను 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు'​ అనే కాన్సెప్ట్​తో రూపొందించారు. అందుకు సంబంధించిన ప్రోమోను ఇప్పుడు రిలీజ్ చేశారు. యాంకర్ లాస్య, రోహిణి(rohini jabardasth) తదితరులు విచ్చేసి తెగ సందడి చేశారు.

వీరితో పాటు రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా' మూవీ(anubhavinchu raja movie raj tarun) టీమ్​ కూడా షోలో పాల్గొని అలరించింది. గ్రామీణ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో కసిస్ ఖాన్ హీరోయిన్. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు.

'ఇండియన్ ఐడల్ 12' ఫేమ్ షణ్ముఖ ప్రియ(shanmukha priya indian idol).. కూడా ఈ ఎపిసోడ్​లో కనువిందు చేయనుంది. 'గజిని' సినిమాలోని 'రహతుల రహతులా' సాంగ్​ను కిర్రాక్ స్టైల్​లో పాడి అలరించింది. ఈమెను హైపర్ ఆది ప్రశంసించగా, ఇంద్రజ హగ్ చేసుకున్నారు.

shanmukha priya indian idol
సింగర్ షణ్ముఖ ప్రియ

'ఢీ' ఫేమ్ రాజు.. తన అమ్మకు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(sridevi drama company latest episode) స్టేజీపై అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. ఇంతవరకు ఆమెకు ఎలాంటి గిఫ్ట్​ ఇవ్వలేదని చెబుతూ, బంగారు ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆమె తనకోసం పడ్డ కష్టాల్ని గుర్తుచేసుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.