దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు యంగ్టైగర్ ఎన్టీఆర్. ఈ చిత్రం పూర్తవ్వగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ప్రాజెక్టు మొదలుపెడతారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత 'కేజీఎఫ్' చిత్రంతో సినీ అభిమానులను ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. తారక్ నటించడానికి రంగం సిద్ధంచేసినట్లు సమాచారం.
సైంటిఫిక్ యాక్షన్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాదిన్నర పాటు తారక్ కాల్షీట్లు కావాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆశిస్తున్నారట. ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్లోనూ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉన్న తారక్.. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్లతో ప్రాజెక్టులను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.