ETV Bharat / sitara

'కేజీఎఫ్' దర్శకుడితో తారక్.. ఫుల్ క్లారిటీ

author img

By

Published : May 20, 2021, 1:31 PM IST

తారక్.. 'ఆర్ఆర్ఆర్', త్రివిక్రమ్​తో సినిమా తర్వాత​ దర్శకుడు ప్రశాంత్ నీల్​తో ఓ సినిమా చేయనున్నారని తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు ఫ్యాన్స్​లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మైత్రీమూవీమేకర్స్​ సంస్థ.

ntr
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్

జూనియర్ ఎన్టీఆర్-'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రానుందని మైత్రీమూవీ మేకర్స్​ నిర్మాతలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ దర్శకుడు ప్రభాస్​తో తెరకెక్కిస్తున్న'సలార్' తర్వాత తారక్ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు. గురువారం ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్​ గురించి మరోసారి అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్​ చేసింది నిర్మాణ సంస్థ.

ఎలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తారు? ఇందులోని ఇతర నటీనటులు ఎవరు? అనే విషయాల్ని త్వరలో వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న తారక్.. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్​ సినిమా మొదలవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.