ETV Bharat / sitara

'ఆదిపురుష్' గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చా!

author img

By

Published : Aug 21, 2020, 9:01 AM IST

బాలీవుడ్​ దర్శకుడు ఓం ​రౌత్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ ప్రధానపాత్రలో తెరకెక్కనున్న చిత్రం 'ఆదిపురుష్​'. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమాలో అధిక భాగం విజువల్​ ఎఫెక్ట్స్​ కోసమే ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

Makers of Prabhas starrer Adipurush to spend THIS whopping amount on the film's VFX?
భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్న 'ఆదిపురుష్​'!

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్​ పోస్టర్​ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్​ను కేటాయించనున్నారని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. కేవలం విజువల్​ ఎఫెక్ట్స్​ కోసమే దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నారట.

'ఆదిపురుష్​'లో రాముడి పాత్రలో ప్రభాస్​, సీత పాత్రలో హీరోయిన్​ కీర్తి సురేశ్​ నటించనున్నారని సమాచారం. బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. ప్రభాస్​ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వంలో 'రాధేశ్యామ్', నాగ్​ అశ్విన్​తో ఓ సైన్స్​ ఫిక్షన్​ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఆదిపురుష్'​ పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను 3డీ ఎఫెక్ట్​లో తెరకెక్కించబోతుండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.