ETV Bharat / sitara

మహేశ్ 'సర్కారు వారి పాట'లో ఆమెనే ​హీరోయిన్​

author img

By

Published : Jun 18, 2020, 10:35 PM IST

mahesh
మహేశ్​

మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తిసురేశ్​ హీరోయిన్​గా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సూపర్​స్టార్ మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. గత నెల చివర్లో సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో హీరోయిన్​గా ఎవరు నటిస్తున్నారా? అని గతకొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనికి సమాధానం దొరికేసింది.

'మహానటి'తో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్‌ ఇందులో హీరోయిన్​గా నటించనుంది. ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఈమెనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది.

keerhi
కీర్తి

ఇటీవల మహేశ్‌ తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా మాట్లాడుతూ.. "సర్కారు వారి పాట' బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా విషయంలో చాలా ఆత్రుతతో ఉన్నా"నని చెప్పారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

mahesh
సర్కారు వారి పాట

ఇది చూడండి : 'సుశాంత్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.