ETV Bharat / sitara

మహేశ్ సరసన కీర్తి సురేశ్.. ప్రకటన వచ్చేసింది

author img

By

Published : Oct 17, 2020, 11:44 AM IST

Keerthy Suresh joins superstar MaheshBabu starrer Sarkaru Vaari Paata
మహేశ్ సరసన కీర్తి సురేశ్

మహేశ్ ​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా నటించనుంది. ఈ విషయాన్ని కీర్తి పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

సూపర్​స్టార్ మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. గత నెల చివర్లో సూపర్​స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టైటిల్‌ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో హీరోయిన్​గా ఎవరు నటిస్తున్నారా? అని గతకొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనికి సమాధానం దొరికేసింది.

'మహానటి'తో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్‌ ఇందులో హీరోయిన్​గా నటించనుంది. కీర్తి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఇప్పటికే కీర్తి ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.