ETV Bharat / sitara

'అందుకే ప్లాస్మా దానం చేయలేకపోతున్నా..'

author img

By

Published : Sep 1, 2020, 2:32 PM IST

'బాహుబలి' దర్శకుడు రాజమౌళి ఇటీవలే కరోనాను జయించారు. కొవిడ్​-19 నుంటి బయటపడిన అందరూ ప్లాస్మాను దానం చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా తాను ఎందుకు ప్లాస్మా దానం చేయలేకపోయారో క్లారిటీ ఇచ్చారు జక్కన్న.

director rajamouli latest news
'ప్లాస్మా అందుకే దానం చేయలోకపోతున్నా...'

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని ట్విట్టర్​ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. తాజాగా జక్కన్న ఆప్తులు, సంగీత దర్శకుడు కీర‌వాణి ప్లాస్మా దానం చేశారు. ఆయ‌నతో పాటు తన త‌న‌యుడు కాల‌భైర‌వ కూడా ప్లాస్మా ఇచ్చారు. అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి మాత్రం ప్లాస్మా దానం చేయలేదు. తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు దర్శకధీరుడు.

"కరోనా నుంచి కోలుకున్నాక.. మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుంది. నా శరీరంలో యాంటీబాడీస్​‌ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని వైద్యులు తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారు"

--రాజమౌళి, ప్రముఖ దర్శకుడు

ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జూ.ఎన్టీఆర్, రామ్​చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.

  • Tested for antibodies.. My igG levels are 8.62. They should be above 15 to be able to donate... Peddanna and Bhairava donated today... pic.twitter.com/5zVmj0dvt0

    — rajamouli ss (@ssrajamouli) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.