ETV Bharat / jagte-raho

ఆగిఉన్న ట్రాక్టర్​ను ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి

author img

By

Published : Dec 3, 2020, 12:16 PM IST

road accident on national highway 14
ఆగి ఉన్న ట్రాక్టర్​ను బైక్​ ఢీ.. ఒకరు మృతి

మెదక్​ జిల్లా రామాయంపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీకట్లో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు.. రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్​ని గమనించకపోవడంతో ట్రాక్టర్​ని ఢీ కొన్నారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్యకి తీవ్ర గాయాలయ్యాయి.

మెదక్ జిల్లా రామాయంపేట శివారులో జాతీయ రహదారి 44పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న చెరుకు ట్రాక్టర్​ను వెనుక నుంచి వస్తున్న బైక్​ ఢీ కొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బిక్కనూర్​ గ్రామానికి చెందిన ధర్మేంద్ర​ సింగ్​, జీత్​ కౌర్​ దంపతులు బాలానగర్​లోని ఫంక్షన్​కి వెళ్లి తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చెరుకు లోడుని తీసుకెళ్తున్న ట్రాక్టర్​ పాడైపోగా దానిని రహదారిపై నిలిపివేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ధర్మేంద్ర.. చీకట్లో ట్రాక్టర్​ని గమనించలేదు. దీంతో వేగంగా వచ్చి ట్రాక్టర్​ను ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. భార్యకి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆమెను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరో పదినిమిషాల్లో ఇంటికి తిరిగి వెళ్తారనే సమయంలో ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: మత్తు ఉచ్చులో విద్యార్థులు... కిక్కు కోసం బానిసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.