ETV Bharat / jagte-raho

రుణమిస్తామని నమ్మించి... అందినకాడికి దోచుకున్నారు

author img

By

Published : Oct 16, 2020, 4:08 PM IST

రుణమిస్తామని నమ్మించి... అందినకాడికి దోచుకున్నారు
రుణమిస్తామని నమ్మించి... అందినకాడికి దోచుకున్నారు

అమాయకుల అవసరాలనే ఆసరాగా తీసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. అప్పులిస్తామని నమ్మిస్తూ... బాధితుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా... ప్రతీ చోట సైబర్​ నేరగాళ్లు కాచుకుని ఉంటున్నారు. తాజాగా ఫేస్​బుక్​లోని నంబర్​ సాయంతో ఓ వ్యక్తిని నిండా ముంచేశారు.

రుణం ఇస్తామంటూ ఫేస్​బుక్​లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన పోస్టును నమ్మి లక్షకు పైగా సమర్పించుకున్నాడు ఓ అమాయకుడు. హైదరాబాద్​లోని మాదన్నపేట్​కు చెందిన గిరిప్రసాద్... ఫేస్​బుక్​లో ఉన్న ఫోన్ నంబర్​కు సైబర్ నేరగాళ్లు కాల్ చేసి... తాము రూ.3 లక్షలు రుణం ఇస్తామంటూ బాధితున్ని నమ్మించారు.

ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ పది వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, జీఎస్టీ అంటూ పలు రకాలైన ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేశారు. చెల్లించే ఈ డబ్బులన్నీ రుణంతో పాటే వచ్చేస్తాయంటూ నమ్మించడం వల్ల బాధితుడు మొత్తంగా లక్షా 14 వేల నగదు డిపాజిట్ చేశాడు. అనంతరం అటునుంచి ఎటువంటి స్పందన లేకపోవటం వల్ల మోసపోయానని గ్రహించాడు.

వెంటనే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఓఎల్ఎక్స్​లో సోఫా అమ్మేందుకు ప్రయత్నించిన పంజాగుట్టకు చెందిన ఓ మహిళ నుంచి రూ.65 వేలను సైబర్​ నేరగాళ్లు నొక్కేశారు.

ఇదీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.