ETV Bharat / jagte-raho

యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

author img

By

Published : Oct 16, 2020, 5:28 AM IST

The khammam girl who were raped by the owner's son is dead
యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

ఖమ్మంలో యజమాని కుమారుడి కిరాతకానికి గురైన 13 ఏళ్ల బాలిక నెల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ గురువారం.. హైదరాబాద్​లో మృతి చెందింది. నిందితుడు అల్లం మారయ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

ఖమ్మంలో యజమాని కుమారుడి కిరాతకానికి గురైన 13 ఏళ్ల బాలిక హైదరాబాద్​లో గురువారం మృతి చెందింది. స్థానిక పార్శీబంధం ప్రాంతంలో అల్లం సుబ్బారావు ఇంట్లో పనిచేసే బాలికపై కన్నేసిన అతడి కుమారుడు మారయ్య గత నెల 19న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. లొంగకపోవడంతో పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలకు గురైన బాధితురాలు నెల పాటు మృత్యువుతో పోరాడింది.

మొదట ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు రహస్యంగా చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆమె తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హైదరాబాద్​ తరలించారు. వారం నుంచి అక్కడ చికిత్స పొందుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచింది. నిందితుడు అల్లం మారయ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

ఇదీ చూడండి: జూరాలకు భారీగా వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.