ETV Bharat / international

Somalia Bombing 2023 : దూసుకొచ్చిన 'బాంబు'ల వెహికల్.. చెక్​పోస్ట్​ వద్ద 18 మంది మృతి.. మరో 40 మంది...

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 6:33 AM IST

Updated : Sep 24, 2023, 6:56 AM IST

Somalia Bombing 2023
Somalia Bombing 2023

Somalia Bombing 2023 : సోమాలియాలోని భద్రతా చెక్‌పోస్టు వద్ద జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

Somalia Bombing 2023 : పేలుడు పదార్థాలతో ఉన్న ఓ వాహనం దూసుకురావడం వల్ల భద్రతా చెక్‌పోస్టు వద్ద పేలుడు సంభవించింది. మధ్య సోమాలియాలోని బెలెడ్‌వెయిన్‌ నగరంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు వెల్లడించారు.

Somalia Bomb Blast : "పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కు.. ప్రభుత్వం ఆధీనంలోని చెక్​పోస్ట్​పైకి దూసుకువచ్చింది. భద్రత అధికారులు వాహనం దాన్ని వెంబడిస్తుండగా ఒక్కసారిగా అది పేలింది" అని ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి అబ్దికదిర్ అర్బా తెలిపారు. పేలుడు జరిగినప్పుడు ప్రమాద స్థలానికి తాను 200 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
తూర్పు ఆఫ్రికాలో అల్‌ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న అల్‌ షబాబ్‌ తీవ్రవాదులపై సోమాలియా ప్రభుత్వం ఇటీవలే సైనిక దాడి చేపట్టింది. కాగా తాజా పేలుడుకు బాధ్యత వహిస్తూ అల్‌ షబాబ్‌ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని.. 100 మంది మృతి
కొద్ది రోజుల క్రితం కూడా సోమాలియా రాజధానిలో ఒక్కసారిగా రెండు చోట్ల భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. ఘఠన జరిగింది. పేలుళ్లలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హోటల్​పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది మృతి.. 47 మందికి గాయాలు
అంతకు ముందు కూడా ఇదే సోమాలియాలో మిలిటెంట్లు రెచ్చిపోయారు. తీర ప్రాంత నగరమైన కిస్మయోలో భీకర దాడికి తెగబడ్డారు. తొలుత పేలుడు పదార్థాలు నింపిన కారుతో హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం కొందరు సాయుధులు హోటల్​లోకి ప్రవేశించారు. ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఘటనలో చాలా మంది గాయపడ్డారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Pakistan Bomb Blast : పాక్​లో బాంబు దాడి.. 11 మంది కూలీలు మృతి

Cracker Factory Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

Last Updated :Sep 24, 2023, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.