ETV Bharat / bharat

Cracker Factory Blast : బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 11:51 AM IST

Updated : Aug 27, 2023, 1:27 PM IST

Cracker Factory Blast In West Bengal : బంగాల్..​ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బిహార్​లో జరిగిన మరో ఘటనలో ఫ్రిడ్జ్​ పేలి ఓ బాలిక, ఒక మహిళ మృతిచెందారు.
Firecracker Blast In West Bengal
Firecracker Blast In West Bengal

Cracker Factory Blast In West Bengal : బంగాల్..​ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పలువురు గాయపడినట్లు వెల్లడించారు. మృతుల్లో మహిళలు ఉన్నట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. దత్తపుకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్న మోష్‌పోల్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా.. అకస్మాత్తుగా పేలుడు (Blast In Crackers Factory) సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. మృతుల శరీర భాగాలు పక్కనున్న ఇళ్లపై, చెట్లపై కూడా పడ్డాయని చెప్పారు. ఈ ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

  • #WATCH | West Bengal: Several people feared dead in an explosion at the Illegal crackers factory in Duttapukur. A rescue operation is underway. The injured are being taken to Barasat Hospital for treatment: Duttapukur Police sources pic.twitter.com/YzKW7cU8gM

    — ANI (@ANI) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఫ్యాక్టరీలో బాణసంచా తయారీని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఆ ఫ్యాక్టరీలో బాణసంచా తయారీ కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న మృతదేహాలను చూశానని ఓ స్థానికుడు తెలిపాడు. పేలుడు తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేకపోయినా.. ఇతరులతో కలిసి రక్షించానని చెప్పాడు.

ఫ్రిడ్జ్​ పేలి.. తల్లి కళ్ల ముందే కుమార్తె, కోడలు మృతి..
Fridge Blast In Bihar : బిహార్​.. ముజఫర్​పుర్ జిల్లాలో ఫ్రిడ్జ్​ పేలి ఇద్దరు మహిళలు మృతిచెందారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడం వల్ల చుట్టుపక్కల వాళ్లు వచ్చేసరికి ఆలస్యం అయింది. దీంతో మంటల్లో తీవ్రంగా గాయపడిన బాధితులు అక్కడికక్కడే మరణించారు.

ఇదీ జరిగింది.. డియోరియా పోలీస్​ స్టేషన్ పరిధిలోని డుమ్రీ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా (Fridge Blast Reason) ఓ ఇంట్లో ఫ్రిడ్జ్​ పేలింది. అనంతరం మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడం వల్ల.. తల్లి కళ్ల ముందే ఆమె కుమార్తె, కోడలు రీటా అక్కడిక్కడే మృతిచెందారు. అయితే, రీటాకు.. మూడు నెలల క్రితమే నీరజ్​ కుమార్​ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ ఘటనపై బాధిత కుటుంబంతో మాట్లాడుతున్నామని.. కానీ వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని సరౌయా ఎస్​డీపీఓ చందన్ కుమార్​ తెలిపారు.

Explosion in plastic manufacturing industry : ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలో పేలుడు.. 14 మందికి తీవ్రగాయాలు

'రాజకీయ సభలో పేలుడు వెనుక ఐసిస్ హస్తం​.. ముగ్గురు అరెస్ట్'

Last Updated :Aug 27, 2023, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.