ETV Bharat / international

బలగాల ఉపసంహరణపై చర్చలకు అమెరికా, ఇరాక్​ సై

author img

By

Published : Mar 24, 2021, 7:52 AM IST

Updated : Mar 25, 2021, 12:01 AM IST

US, Iraq to hold talks over American troop presence
బలగాల ఉపసంహరణపై అమెరికా, ఇరాక్​ల మధ్య చర్చలు

తమ దేశంలోని అన్ని ప్రాంతాల్లో దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికాను.. ఇరాక్​ కోరిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించింది బైడెన్​ పాలనా యంత్రాంగం. ఈ మేరకు వచ్చే నెలలో ఇరుదేశాలు ఈ అంశంపై చర్చించుకోనున్నట్టు తెలుస్తోంది.

తమ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం సహా ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన ఇతర విషయాలపై బైడెన్​ సర్కార్​తో ఇరాక్​.. ఏప్రిల్​ నెలలో వ్యూహాత్మక చర్చలను జరపనుంది. ఈ మేరకు ఇరాక్​ అధ్యక్షుడు బర్హమ్​ సాలి అమెరికాకు పంపిన అధికారిక మెమో అనంతరం.. ఈ ప్రకటన చేసింది అగ్రరాజ్యం.

ట్రంప్​ పాలనలో గతేడాది జూన్​లో ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే మొదటి సమావేశం ఇదే కానుంది. ఈ భేటీలో యూఎస్​-ఇరాక్​ల భవిష్యత్తు సంబంధాలను రూపొందించేందడమే లక్ష్యంగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భద్రత, వాణిజ్యం, వాతావరణం వంటి అంశాలూ ఇందులో ముడిపడి ఉన్నాయని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​ విమానాశ్రయం వెలుపల ఇరానియన్ జనరల్​ ఖాసీం సులేమాని, ఇరాక్ మిలీషియా నాయకుడు అబూ మహదీ-అల్ ముహందీలను గతేడాది జనవరిలో హతమార్చిన అనంతరం.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.​ ఆ తర్వాత.. మేలో ముస్తఫా అల్​-ఖాదిమి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. అయితే.. పార్లమెంటులో ఇరాన్ మద్దతు కలిగిన ఫతా కూటమి సహా మరికొన్ని పార్టీలు.. అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని పట్టుబట్టాయి.

అమెరికన్​ రక్షణ విభాగం(పెంటగాన్​) ప్రకారం.. ఇరాక్​లో యూఎస్​ దళాల సంఖ్య గత నెలల్లో 2,500కు పడిపోయినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: మాస్క్​ పెట్టుకున్నందుకు చట్టసభ్యుడికి బెదిరింపులు!

Last Updated :Mar 25, 2021, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.