ETV Bharat / international

చైనాలో కరోనా సెకండ్​ ఇన్నింగ్స్- కొత్తగా 23 కేసులు

author img

By

Published : May 19, 2020, 12:32 PM IST

చైనాలో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో 17 మందికి కొవిడ్​ లక్షణాలు కనిపించకుండానే వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. కరోనా కేంద్ర బిందువుగా పరిగణిస్తున్న వుహాన్​లో ఒక కేసు నమోదైంది.

China reports 23 fresh COVID-19 cases including 1 in Wuhan
చైనాలో కరోనా సెకండ్​ ఇన్నింగ్స్​.. కొత్తగా 23 కేసులు!

చైనాలో కరోనా రెండో సారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులగా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 23 పాజిటివ్​ కేసులు బయటపడ్డాయి. ఇందులో 17 కేసులు లక్షణాలు లేకుండా బయటపడ్డవే. దీంతో వైరస్​ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందంటున్నారు వైద్యులు.

చైనా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క రోజులోనే లక్షణాలు కనిపించకుండా వుహాన్​లో ఒకటి, జిలిన్ రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వుహాన్​లో ఇప్పటి వరకు లక్షణాలు లేని పాజిటివ్​ కేసుల సంఖ్య 285కు చేరింది.

వుహాన్​లో లక్షణాలు కనిపించని కేసులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పద్ధతిలో నగర జనాభా మొత్తానికి అంటే సుమారు 1.10 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తోంది.

సోమవారం నాటికి చైనావ్యాప్తంగా 82,860 కేసులు నమోదవగా.. 78,241 మంది కోలుకున్నారు. 85 చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:చైనాలో భూకంపం.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.